కేటీఆర్ కనిపించడం లేదు.. పీఎస్‌లో ఫిర్యాదు

-

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కనిపించడం లేదని గంభీరావుపేట పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు కోడె రమేశ్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంతో పాటు పలు గ్రామాలు నిత్యం సమస్యలతో పోరాటం చేస్తున్నాయని చెప్పారు.నియోజకవర్గాన్ని పట్టించుకునే తీరిక మాత్రం కేటీఆర్‌కు లేకుండా పోయిందన్నారు.

ఎమ్మెల్యేగా గెలిచి సిరిసిల్లను గాలికి వదిలేయడం సరికాదన్నారు. 3 మండలాలకు ప్రధాన రహదారి అయిన గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు.గతంలో ఆర్భాటం చేశారు కానీ,బ్రిడ్జి నిర్మాణం మాత్రం పూర్తి చేయలేదన్నారు.కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే ఇకనైనా నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version