కేటీఆర్-రేవంత్ రెడ్డి ఒకటే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

కేటీఆర్-రేవంత్ రెడ్డి ఒకటేనని కేంద్ర  హోంశాఖ  సహాయమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ర్యాలీలో జోరబడి  విధ్వంసం చేసే కుట్ర బీఆర్ఎస్ చేసిందన్నారు. నేను పేపర్ లీకేజీ చేసిండని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ అసలు మనిషి పుట్టుకా..? కేటీఆర్, మీ అయ్య, మీ కుటుంబ సభ్యులు వచ్చి పేపర్ లీకేజీ చేశానని.. మీరు ఫోన్ ట్యాపింగ్ చేయలేదని ప్రమాణం చేయండి. ప్రమాణం చేస్తే.. నేను మీకు క్షమాపణ చెబుతానని సవాల్ విసిరారు. 

 కేటీఆర్  రేవంత్ రెడ్డి ఒక్కటి కాకుంటే.. జన్వాడా ఫామ్ హౌస్ ఎందుకు కూలగొట్టలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది అని ప్రశ్నించారు. కేటీఆర్ చీకటి బ్రతుకు నాకు తెలియదా..? కేటీఆర్ డ్రగ్స్ కేసు ఏమైంది అని ప్రశ్నించారు.  ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి గ్రూపు-1 అభ్యర్థుల సమస్యలను వినాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి గ్రూపు-1 పరీక్షను రద్దు చేయాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు. రీ షెడ్యూల్ చేయమని అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం గ్రూపు–1 అభ్యర్థుల విషయంలో ఎందుకు మొండి వైఖరీ వహిస్తుందో అర్థం కావడం లేదు అన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version