ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించి తప్పు చేశానని లగడపాటి అన్నారు – హరీష్ రావు

-

మంత్రి హరీష్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం సంగారెడ్డి లో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన సుపరిపాలన దినోత్సవం లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించి తప్పు చేశానని లగడపాటి అన్నారని.. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో లేరని చెప్పారు. ఇక ఓ ఇద్దరు నేతల వల్లే ఇప్పుడు ఏపీ బోక్క బోర్లా పడిందని.. వారిది ప్రచారం ఎక్కువ.. మనది పని ఎక్కువ అని అన్నారు.

గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక కు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పతనం ఏంటో తెలుస్తుంది అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొడుతుందని అన్నారు హరీష్ రావు. తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం వస్తుందని, హైదరాబాద్ లో కర్ఫ్యూ ఉంటుందని కొందరు విమర్శించారని అన్నారు. కానీ ఈ తొమ్మిదేళ్లలో అదేది నిజం కాదని కేసీఆర్ చేసి చూపెట్టారు అని తెలిపారు. దేశానికే రోల్ మోడల్ గా నిలిచిన తెలంగాణకి కేంద్రమే అవార్డులు ఇస్తుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news