దొర ఆడిందే ఆట.. పాడిందే పాట – కేసీఆర్ పై షర్మిల ఫైర్

-

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..! కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన దొర.. సర్కారీ భూములను సైతం వదలడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఏదో ఒక పేరు చెప్పి కారు చౌకకే భూములు కాజేస్తున్నాడని ఆరోపించారు.

“భారత్ భవన్ అట,15 అంతస్తులట. ఎక్స్ లెన్స్ సెంటర్ పెడతాడట. ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి రెండు కార్యాలయాలా..? పార్టీ పేరు మార్చినంత మాత్రాన.. కొత్త భవనానికి సర్కారు భూమి ఇవ్వడమా.. రూ.550కోట్లు పలికే 11 ఎకరాల స్థలం రూ.37కోట్లకే కొట్టేయడమా.? దొర రాజకీయాలకు అగ్గువకే దొరికే సర్కారీ భూములు పేదల సంక్షేమానికి మాత్రం కనపడవు. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి భూములు ఉండవు. 36 లక్షల మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టడానికి భూములు దొరకవు.

అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు భూములు ఉండవు. చివరికి జర్నలిస్టులకు ఇవ్వడానికి స్థలాలు దొరకవు. కానీ దొర విలాసాలకు, పార్టీ కార్యాలయాలకు, ఎక్స్ లెన్స్ సెంటర్లకు మాత్రం అడగంగనే భూములు దొరుకుతయ్. రాత్రికి రాత్రే దొంగ జీవోలు, బదలాయింపులు జరిగిపోతాయ్. అధికారం చేతిలో ఉంది కదా అని దొర ఆడిందే ఆట. పాడిందే పాట” అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news