కేసీఆర్‌ కనుసన్నల్లోనే సీఈవో పని చేస్తున్నారు : కె.లక్ష్మణ్

-

కేసీఆర్‌ కనుసన్నల్లోనే సీఈవో పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు కె.లక్ష్మణ్. మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం చేశారు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం స్రుష్టిస్తున్నారని.. సీఎంఓ నుండి ఆదేశాలొస్తే తప్ప ఫలితాలు వెల్లడించరా? అని నిలదీశారు.

కుంటి సాకులు చెబుతూ టీఆర్ఎస్ కు ఆధిక్యం వచ్చేదాకా కౌంటింగ్ ప్రక్రియను జాప్యం చేస్తారా? అని నిప్పులు చెరిగారు. బీజేపీకి లీడ్ వచ్చే రౌండ్లలోనే ఫలితాలను అప్ డేట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అని ఆగ్రహించారు.

ఎన్నికల మొదటి రోజు నుండి కౌంటింగ్ దాకా సీఈవో పనితీరు అనుమానాస్పదమేనని.. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే సీఈవో పనిచేస్తున్నారని తెలిపారు. పోలింగ్ రోజు టీఆర్ఎస్ స్థానికేతర నాయకులు మునుగోడులో మకాం వేస్తే… ఎవరూ లేరని సీఈవో చెప్పడం హాస్యాస్పదమని.. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఫిర్యాదు చేసిన తరువాత కూడా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని నిప్పులు చెరిగారు డాక్టర్ కె.లక్ష్మణ్.

Read more RELATED
Recommended to you

Latest news