భైంసాను “మైంసా”గా మారుస్తాం – బండి సంజయ్

-

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే బైంసాను దత్తత తీసుకుంటామని తెలిపారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అలాగే బైంసా ఊరి పేరును మైంసాగా మారుస్తామని ప్రకటించారు. బైంసాలో ప్రజా సంగ్రామ యాత్ర సభలో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పై నిప్పులు జరిగారు. భైంసాలో హిందువులు పండుగలు జరుపుకోకుండా ఎంఐఎం, వేధింపులకు గురి చేశాయన్నారు.

“మనం ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నాం? టిఆర్ఎస్, ఎంఐఎం కలిసి బైంసాలో హిందువులపై దాడులు చేశాయి. భైంసా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. భైంసా అంటే కెసిఆర్ కు సాధారణంగానే భయం ఉంటుంది. ఈ సభ చూసిన తర్వాత సీఎం కెసిఆర్ రెండు పెగ్గులు తాగేవాడు ఫుల్ బాటిల్ తాగుతాడు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే మనవాళ్ల గురించి ఆలోచిస్తాము. హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీ యాక్ట్ ఎత్తివేస్తాము “అన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news