రేవంత్ రెడ్డి పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ను ఎదుర్కొనే పరిస్థితిలో కాంగ్రెస్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించారు. అది నయం చేయలేని స్థితికి చేరుకుందన్నారు. ఒక హోంగార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి పోతే పోయేదేమీ లేదన్నారు.

రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదని.. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను 10 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు. ఇన్చార్జులతో డబ్బు ఖర్చు పెట్టించి వారిని డొల్ల చేశాడని ఆరోపించారు. ఖర్చు పెట్టకపోతే టికెట్లు, పదవులు ఇవ్వనని బెదిరించాడని కీలక ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవoత్ అందుబాటులో ఉండడని.. చెంచా గాళ్లను పెట్టి పార్టీని నడిపిస్తున్నాడని మండిపడ్డారు.

ఇక తన లాగే చాలామంది పార్టీని వీడే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పదిహేను మందిని గెలిపించుకొని తన సొంత దుకాణం చూసుకోవాలని భావిస్తున్నారని అన్నారు. రేవంత్ కు పీసీసీ ఇవ్వొద్దని వారించిన వారిలో తాను ఒకడినని.. తెలంగాణ పార్టీ పరిస్థితులపై మూణ్ణెళ్ల క్రితమే అధిష్టానానికి చెప్పానన్నారు. కాంగ్రెస్ నుంచి మారుతా అని అనుకోలేదని.. Always కాంగ్రెస్ మ్యాన్ ని అనుకున్నానన్నారు. కానీ.. తప్పని పరిస్థితుల్లో తప్పడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news