మిర్యాలగూడకు పదివేల కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్..!

-

నల్లగొండ జిల్లా.. మిర్యాలగూడలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా పర్యటించారు. ఈ క్రమంలో మంత్రికి.. పార్టీ శ్రేణులతో కలిసి ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. పట్టణంలో నూతనంగా నిర్మించనున్న నాలుగు ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేసారు మంత్రి. ఈ కార్యక్రమంలో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే కుందూర్ జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వరద బాధితుల కోసం 30టన్నుల బియ్యాన్ని తరలించే కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక కామెంట్స్ చేసారు.

గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్లక్ష్యానికి గురైంది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నాలుగేళ్ల క్రితమే యాదాద్రి ధర్మాలు పవర్ ప్లాంట్ అందుబాటులోకి వచ్చేది. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం ఎన్ని కొట్లినా ఖర్చు చేసే పూర్తి చేస్తాం. నల్లగొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. మిర్యాలగూడకు పదివేల కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మంజూరు చేయిస్తా. ఇంకా పది ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version