‘ఆత్మ నిర్భర్ భారత్ అదుర్స్’ అని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ ట్వీట్

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. మోదీని టార్గెట్ చేస్తూ మళ్లీ ట్వీట్​ల వర్షం కురిపించారు. ఈసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా ఘాటుగా ట్వీట్ బాణాలు సంధించారు. ఇంతకీ కేటీఆర్ చేసిన ట్వీట్ ఏంటంటే..?


దేశంలోని ఖాదీ పరిశ్రమ జాతీయ జెండాలను తయారు చేయగలిగే పరిస్థితుల్లో లేదన్న
కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఎన్డీఏ సర్కార్‌ను ఎన్పీఏ సర్కార్‌గా పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి ముందు చూపు, సరైన ప్రణాళిక లేదని కేటీఆర్ దుయ్యబట్టారు.

ఎన్పీఏ ప్రభుత్వ దార్శనికుడు, విశ్వగురు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 75వ స్వాతంత్ర్య వేడుకల గురించి ఏడాది ముందు తెలిసినా.. జాతీయ జెండాలను తయారు చేయించలేకపోయారని ట్వీట్‌ చేశారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ చాలా బాగుందని మంత్రి కేటీఆర్​ ఎద్దేవా చేశారు. జాతీయ జెండాల దిగుమతిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమర్థించిన వార్త కథనాన్ని కూడా కేటీఆర్​ ట్యాగ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news