ఆ పనికి మాలిన ఎమ్మెల్యేలకు రూ.400 కోట్లు ఇస్తే…వృధానే ? అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆ నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రజా బలం అస్సలు లేదని.. వారిని మేమేందుకు కొంటామని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు trs చేసిన పెద్ద కుట్ర అని.. ఓటమి కళ్ళ ముందు కన్పించడం తో కొత్త ఆటకు తెర లేపారని ఆగ్రహించారు.