టీఆర్ఎస్ పార్టీలో భూకంపం రాబోతుంది- మురళీధర్ రావు

-

బిజెపి నేత మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ లో అసమ్మతి బాంబ్ త్వరలో బ్లాస్ట్ అవుతుందని.. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని.. ఉచిత పథకాలపై ఒక్క రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడింది కాదని పేర్కొన్నారు.

కార్పొరేట్ లోన్లు ఎక్కడ తీసివేయలేదు.. టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే.. కేంద్ర ప్రభుత్వం Vs రాష్ట్ర ప్రభుత్వం అని చూపేందుకు తప్పుడు రాజకీయ ప్రచారం చేస్తూ యుద్ధం ప్రారంభిస్తున్నారని ఆగ్రహించారు. ఈ యుద్ధంలో కేసీఆర్ కు ఓటమి తధ్యమని.. కేసీఆర్ కు… ED తలుపులు ఎంతో దూరం లేదని పసిగట్టి.. ముందే తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఆ అవినీతి అంతా బయటకు వస్తుందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని… టిఆర్ఎస్ లో భూకంపం రాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తే ఆగే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news