ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి : ఎంపీ రఘునందన్ రావు

-

ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ యువమోర్చ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అద్యక్షులు గోదావరి అంజిరెడ్డి అధ్యక్షతన.. అలాగే జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగా యాత్ర కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు.

దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారని.. వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. ఆగస్టు 15 సందర్భంగా ప్రతీ భారతీయుడికి దేశం పట్ల గౌరవం, అంకిత భావం వివరిస్తూ.. వారికి వారి ఇండ్ల పై జాతీయ జెండాను ఎగురవేసుకునేలా తెలియజేయాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు అంతగా ఏం లేదని.. గత బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు పెద్ద తేడా ఏమి లేదన్నారు.  ఈ కార్యక్రమానికి బీజేపీ, బీజేవైఎం నేతలు భారీగా తరలివచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version