హైదరాబాద్‌-విశాఖ మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

-

రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్‌-విశాఖపట్నం (Hyderabad-Visakhapatnam)మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. తెలంగాణాలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరాపల్లి వరకు నాలుగు వరుసల మార్గానికి (ఫోర్‌ లేన్‌ వే) కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈ మార్గానికి జాతీయ రహదారి హోదా కల్పిస్తూ కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రహదారికి 765 డీజీ నంబరును కేటాయించింది.దీంతో హైదరాబాద్‌-విశాఖ మార్గానికి కేంద్రం నుంచి అనుమతి లభించినట్లు అయింది.

హైదరాబాద్‌-విశాఖపట్నం /Hyderabad-Visakhapatnam
హైదరాబాద్‌-విశాఖపట్నం /Hyderabad-Visakhapatnam

ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు మొత్తం 158 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించాల్సి ఉంటుంది. కాగా హైదరాబాద్‌ నుంచి సూర్యాపేటకు ఇప్పటికే జాతీయ రహదారి అందుబాటులో ఉండగా… సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు ఫోర్‌ లేన్‌ విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. దేవరాపల్లి నుంచి విశాఖ వరకు ఇదివరకే ఫోర్‌ లేన్‌ వే ఉంది. అయితే ఖమ్మం నుంచి దేవరాపల్లి వరకు కొత్త రహదారి నిర్మిస్తే మొత్తం 625 కి.మీ మేర హైదరాబాద్‌-విశాఖ మధ్య పూర్తిగా రహదారి అందుబాటులోకి రానుంది.

ఖమ్మం నుంచి దేవరాపల్లి రహదారిని హరిత మార్గంగా నిర్మించాలని కేంద్రం ఇంతకు ముందే నిర్ణయించింది. ఈ మార్గానికి డీజీ నంబరు కేటాయించటంతో ఈ ఆర్థిక సంవత్సరంలోనే భూ సేకరణ ప్రక్రియ చేపట్టేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మార్గం పూర్తయితే తెలంగాణ నుంచి విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టులకు సరుకు రవాణాకు మేలు జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news