మంత్రి హరీష్ రావుకు నిర్మలా కౌంటర్..వరి వేసే ఉరే అన్నది మీరు !

-

తెలంగాణ మంత్రి హరీష్ రావుకు నిర్మలా కౌంటర్ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ బెదిరింపు రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాలు చూడు అని ఇక్కడి మంత్రి హరీష్‌ రావు అంటున్నారు… ముందు నీ రాష్ట్రం చూడు ఎంత మంది ఆత్మహత్య చేసుకున్నారని ఫైర్‌ అయ్యారు.

రైతులపై ప్రేమ ఉంటే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని… రైతులకు సహకారం అందిస్తామని ఇక్కడి ప్రభుత్వం చెబుతుందని చురకలు అంటించారు. Trs ప్రభుత్వం 2014 నుంచి తెలంగాణలో 17000 కోట్లు రుణ మాఫీ చేస్తామని చెప్పింది… కానీ 100 మంది రుణాలు తీసుకుంటే 5 గురికి మాత్రమే మాఫీ చేశారని నిప్పులు చెరిగారు.

ఈ విషయాన్ని sbi చెప్పిందన్నారు. తెలంగాణకి పీఎం కిసాన్ సమ్మన్ నిధి కింద 2014 నుంచి ఇప్పటివరకు 7658 కోట్లు ఇచ్చామని తెలిపారు. దీని ద్వారా 37.95 లక్షల రైతులకు లబ్ది చేకూరిందని.. కృషి వికాస్ యోజస్ 8590 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. మొత్తం రైతుల కోసం తెలంగాణకి 10729 కోట్లు ఇచ్చామని… ఇంకా కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారని హరీష్‌ పై మండిపడ్డారు. రైతులు వరి వేసే ఉరే అన్నది మీరేనని చురకలు అంటించారు నిర్మలమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news