కెసిఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా మునుగోడు ప్రజలు బిజెపినే గెలిపిస్తారు – ఈటల రాజేందర్

-

సీఎం కేసీఆర్ ఎన్ని ఎత్తుగడలు వేసినా మునుగోడు ప్రజలు బిజెపిని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్. నల్గొండ జిల్లా కేంద్రంలోని పద్మనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల సమస్యలు గుర్తుకు వస్తాయని మండిపడ్డారు.

ఉప ఎన్నికలు అయిపోగానే మళ్లీ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా అక్కడ ముందస్తుగా పోలీసులు, ఇంటెలిజెన్స్, పార్టీ నాయకులను దింపుతారని ఫైర్ అయ్యారు. నాయకులతో దావత్ లు పెట్టించి కార్యకర్తలను మభ్యపెడతారని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో అక్కడ ఏ విధంగా అయితే దళితులందరికీ దళిత బంధు ఇచ్చారో.. అలాగే మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికకు ముందే దళితులకి దళిత బంధు, గిరిజనులకి అందరికీ గిరిజన బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news