చికోటి కేసులో తెలంగాణ,ఏపీ ఎమ్మెల్యేలకు నోటీసులు !

-

చీకోటి క్యాసినో ఈడీ కేసులో రాజకీయ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారు ఈడీ అధికారులు. చికోటి ప్రవీణ్ తో జరిగిన వాట్సాప్ సంభాషలపై ఆరా తీస్తున్న ఈడీ అధికారులు.. తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కు నోటీసులు రంగం సిద్ధం చేశారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, ఇంకా చాలా మంది నాయకులు ఈ కేసులో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

థాయిలాండ్ ,మలేషియా, శ్రీలంకలో జరిగిన క్యాసినో వ్యవహారంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు అధికారులు. తనకు ప్రాణహాని ఉందని పోలీస్ బందోబస్తు కల్పించాలని హైకోర్టు లో రిట్ పిటిషన్ వేసిన చికోటి… అనుమానాస్పద వ్యక్తులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక అటు చికోటి కెసినో వ్యవహారం లో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. 4 రోజుల పాటు చికోటి ప్రవీణ్ ను విచారించారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news