నాగార్జున పిటిషన్ లో ఒకటి.. వాంగ్మూలంలో మరొకటి చెప్పారు : లాయర్ తిరుపతి వర్మ

-

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సినీ నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ నాగార్జున హాజరై స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. ముఖ్యంగా “మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు, మర్యాదలకు భంగం కలిగింది. మా కుమారుడు నాగచైతన్య, సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలున్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలున్నాయి.

జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. తమ కుటుంబం పై మంత్రి మాట్లాడటం సరికాదు. మంత్రి కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి” అని స్టేట్ మెంట్ ఇచ్చారు నాగార్జున. ఈ కేసులో నాగార్జున తరపున అశోక్ రెడ్డి అనే లాయర్ వాదనలు వినిపించారు.  ఈ తరుణంలోనే కొండా సురేఖ తరపు లాయర్ తిరుపతి వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున పిటిషన్ లో ఒకటి చెప్పారు. వాంగ్మూలల్లో మరొకటి చెప్పారు. సుప్రియ వాంగ్మూలలో మరొకటి చెప్పారు. ముగ్గురు వ్యక్తుల వాంగ్మూలలో తేడాలు ఉన్నాయి. ఈ కేసు కోర్టులో నిలబడదని అనుకుంటున్నాం. మంత్రి కొండా సురేఖ పై సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై డీజీపికి రేపు ఫిర్యాదు చేస్తామని లాయర్ తిరుపతి వర్మ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version