ఉల్లి లొల్లి.. తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ధర

-

మొన్నటి దాక సామాన్యులను టమాట ధరలు ఎంతగా ఇబ్బంది పెట్టాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మిర్చి ధరలు కూడా అమాంతంగా పెరిగాయి. ఇక ఇప్పుడిప్పుడే కూరగాయల ధరలు ఒక్కొక్కటిగా అదుపులోకి వస్తున్నాయి అని సామాన్యులు సంతోషపడేలోగా ఉల్లి లొల్లి షురూ అయింది. తెలంగాణలో వారం రోజులుగా.. ఉల్లి ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి.

ఆగస్టులో రూ.100కి ఆరు కేజీలు ఉన్న ఉల్లి.. సెప్టెంబరుకి నాలుగు కేజీలక చేరింది. ఇక ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.50 వరకు ఉంది. ఆగస్టు ముందు వరకు రూ.16 నుంచి రూ.18 ఉన్న ధర ఇప్పుడు 50 రూపాయలకు చేరడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాలు సరిగా లేకపోవడం వల్ల కర్నూలు, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌, చేవెళ్లలో పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గిందని రైతులు చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలోనూ ఇదీ పరిస్థితి ఉండట వల్లే ఉల్లి ధరలు పెరిగాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

హైదరాబాద్​కు 80 నుంచి 100 లారీల ఉల్లి పంట రావాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం 29 వచ్చాయని మలక్‌పేట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి దామోదర్‌ వెల్లడించారు. నవంబరు రెండో వారంలో స్థానికంగా ఖరీఫ్‌ పంట అందుబాటులోకి రానుండటంతో ధరలు తగ్గే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version