BREAKING : వైఎస్ షర్మిలకు పోలీసులు నోటీసులు.. పాదయాత్ర రద్దు ?

-

వరంగల్ : వైఎస్ షర్మిల మరోసారి బిగ్ షాక్ తగిలింది. వైఎస్ షర్మిల పాదయాత్రకు వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వాలో చెప్పాలంటూ తాజాగా వైఎస్ షర్మిలకు పోలీసులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

కోర్ట్ ఆదేశాలతో నేటి నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు వైఎస్ షర్మిల ప్లానింగ్ చేసుకుంది. అయితే, పోలీసుల నోటీసులతో ఈ రోజు పాదయాత్రకు విరామం ప్రకటించింది వైఎస్ షర్మిల. మరి రేపటి నుంచి అయినా వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

ఇక అటు KCR అమరవీరులకు, ఉద్యమకారులకు తీరని ద్రోహం చేశారు. 1200మంది ఆత్మబలిదానం చేసుకుంటే కొంతమందినే గుర్తించారు. నీళ్లు, నిధులు, నియామకాలకు తూట్లు పొడిచి, సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు. కుటుంబానికి, ఉద్యమద్రోహులకు పదవులు కట్టబెట్టి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news