రేవంత్‌కి రాజగోపాల్‌రెడ్డి ఛాలెంజ్..మునుగోడులో డిపాజిట్ రాదు

-

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డికి రాజగోపాల్‌రెడ్డి ఛాలెంజ్ విసిరారు. కాంట్రాక్ట్‌ కోసమే పార్టీ మారినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. లేదంటే పీసీసీకి రాజీనామా చేస్తావా..? అని సవాల్ విసిరారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని.. ఎవరిని పండ పెట్టీ తొక్కుతవని చురకలు అంటించారు.

నువ్వు ఉన్నది ఎంతా మూడు ఫీట్లు.. నన్ను తొక్కుతవా ? మునుగోడు జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డి తనలా ధైర్యంగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లెటర్ ఇవ్వకుండా చంద్రబాబుకి ఇచ్చారని దుయ్యబట్టారు.

ఉప ఎన్నికలకు భయపడే రాజీనామా నాటకం చేశాడని అన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తి తనపై నిందలు వేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. రేవంత్ ఓ బ్లాక్ మెయిల్.. వ్యాపారాలు లేనిది డబ్బులు ఎలా సంపాదిస్తున్నావని రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news