బండ్ల గణేష్ తో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. ఏం చర్చించారంటే?

-

సినీ నిర్మాత బండ్ల గణేష్ తో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం బండ్లగణేష్ నివాసానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న గణేష్ ను.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని టీ పిసిసి అధ్యక్షుడు కోరినట్లు తెలుస్తోంది. ఇక కొద్ది రోజుల క్రితం బండ్లగణేష్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్ల అంశంపై స్పందిస్తూ..

టీపీసీసీ పదవి నుంచి ఆయనను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లో ఉన్నారని, అలాంటిది రాష్ట్రాన్ని నడిపేందుకు కులతత్వం ఉన్న వ్యక్తి అనర్హుడని, రాహుల్ గాంధీ సామాజిక సూత్రం ప్రకారం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని బండ్ల గణేష్ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి.. బండ్ల ఇంటికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. బండ్ల గణేష్ ను యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకు వచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news