సూసైడ్ చేసుకోబోయే యువతి ప్రాణాలు కాపాడిన తెలంగాణ ఆర్టీసీ

-

సూసైడ్ చేసుకోబోయే యువతి ప్రాణాలు కాపాడింది తెలంగాణ ఆర్టీసీ. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, ఓ యువతి ప్రాణాలు కాపాడారు నారాయణ ఖేడ్ డిపో బస్ కండక్టర్. పటాన్ చెరులో బస్ ఎక్కి JBS బస్టాండ్ బస్సు దిగి పర్సు మరిచి పోయింది యువతి. పర్సు కింద పడి ఉండటాన్ని గమనించి పర్సును ఓపెన్ చేశారు కండక్టర్ రవి.

 

పర్సులో 403 రూపాయలతో పాటు సూసైడ్ నోట్ చూసిన కండక్టర్.. వెంటనే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కి ట్విట్టర్ ద్వారా దృష్టికి తీసుకెల్లాడు. యువతి ఫోటో, సూసైడ్ నోట్, ఆధార్ కార్డు ని సజ్జనార్ కి పంపాడు.

వెంటనే యువతిని అధికారులను ఆదేశించారు ఎండి సజ్జనార్. ఆర్టీసీ ఎస్సై దయానంద్, మారేడ్ పల్లి సహాయంతో యువతిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. యువతి ప్రణాలను కాపాడిన కండక్టర్ రవిని అభినందించారు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్.

Read more RELATED
Recommended to you

Latest news