కేటీఆర్ తీరును మహిళా లోకం స్వాగతిస్తోంది..!

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ప్రసంగంలో పొరపాటు దొర్లితే హుందా గా క్షమాపణ చెప్పారు. కాబట్టి తీరును మహిళా లోకం స్వాగతిస్తోంది అని BRS మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి అన్నారు. అయితే కేటీఆర్ క్షమాపణ చెప్పినా కొందరు కాంగ్రెస్ మహిళా నేతలు ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు. ఇద్దరు మహిళా మంత్రులు కూడా కేటీఆర్ పై విమర్శలు చేస్తున్నారు.

ఈ విషయంలో మహిళా కమిషన్ అతి వేగంగా స్పందించింది. కానీ ఎనిమిది నెలలుగా రాష్ట్రం లో మహిళల పై 1800 అత్యాచారాలు జరిగాయి. రేప్ లు మర్డర్లు నిత్యకృత్యంగా మారాయి. మహిళల పై ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నా స్పందించని మహిళా కమిషన్ కేటీఆర్ పొరపాటున మాట్లాడిన మాటల పై అంత వేగంగా స్పందిస్తుందా ?.. కేటీఆర్ వ్యాఖ్యల పై మహిళ కమిషన్ చూపిన ఉత్సాహం భాదిత మహిళలను పరామర్శించడం లో ఎందుకు చూపలేకపోయింది అని ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version