సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

-

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగదేవ్పూర్ మండలం మునిపడ మల్లన్న ఆలయం వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు.

గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని హుటాహుటిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news