KCR హంతకుడు! ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడు – షర్మిల

-

సీఎం కేసీఆర్‌ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. KCR హంతకుడు! ఒకేరోజు ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాడంటూ నిప్పులు చెరిగారు. డిగ్రీ చదివి నాలుగేండ్లయినా ఉద్యోగం రాక శివకుమార్ ఉరి వేసుకున్నాడు… 20 రోజులైనా వడ్లకు కాంటాలు వేయక రైతు యల్లయ్య గుండె ఆగిందన్నారు. 15రోజులుగా సమ్మె చేస్తున్నా.. సర్కారు స్పందించక జీపీ కార్యదర్శి సోనీ తనువు చాలించింది.

తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకుంటున్నా.. కేసీఆర్ దొరకు దున్నపోతు మీద వాన పడ్డట్టే అంటూ ఆగ్రహించారు. కొలువులు లేక పుట్టెడు దు:ఖంతో యువత..వడ్లు కొనక కన్నీటి వ్యధతో రైతులు..ఉద్యోగ భరోసా లేక మనస్తాపంతో కార్యదర్శులు.. చచ్చిపోతున్నా కనికరించవా కేసీఆర్? అని నిలదీశారు. ఇంకెంతమంది ఉసురు తీసుకుంటావ్? నీ కుటుంబానికి పదవులు కావాలె! మా బిడ్డలకు ఉద్యోగాలు వద్దా? అని ప్రశ్నించారు. నీ కుటుంబం ఆస్తులు సంపాదించుకోవాలె! మా రైతులు అప్పులు తీర్చుకోవద్దా? నీ కుటుంబం కోట్లకు పడగలెత్తాలె! మా బిడ్డలు పాడె ఎక్కాల్నా?ఇంకా నువ్ ఎందుకు బతికున్నట్టు KCR? అనిఆగ్రహించారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news