చొప్పదండికి కేసీఆర్ అల్లుడు.. కేటీఆర్ మనువడు..అభివృద్ధి మాత్రం శూన్యం – షర్మిల

-

చొప్పదండికి కేసీఆర్ అల్లుడు.. కేటీఆర్ మనువడు..అభివృద్ధి మాత్రం శూన్యం అని వైఎస్‌ షర్మిల ట్వీట్‌ చేశారు. నిన్న చొప్పదండిలో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేశారు. చొప్పదండికి వైయస్ఆర్ గారు ఎస్సారెస్పీ కాల్వల ద్వారా లక్ష ఎకరాలు, నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా 30వేల ఎకరాకలకు సాగు నీరు అందించారు. కేసీఆర్ మోతె రిజర్వాయర్​ను అటకెక్కించడమే కాక కాళేశ్వరం నీళ్లను తన ఫామ్ హౌజ్​కు తరలించి, రైతుల కడుపులో మట్టి కొట్టాడని ఆగ్రహించారు.

ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా రోడ్ల వెంటే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటే, మా ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక ముఖ్యమంత్రి, మంత్రులు టీఆర్ఎస్ గూండాలతో దాడులు చేయిస్తున్నారు. మీ దాడులకు, మీ బెదిరింపులకు భయపడదు YS రాజశేఖరరెడ్డి బిడ్డ. ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడుతానని స్పష్టం చేశారు షర్మిల. ఓపిక కాదు ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతాం. మీ పిట్ట బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు వైయస్ఆర్ బిడ్డ. ఒక్కసారి బరిలోకి దిగాక వెనకడుగు వేయబోం. మీరు ఫ్లెక్సీలు చింపినా, దాడులు చేసినా, రాళ్లు విసిరినా వెనక్కి తగ్గేది లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news