హిందువుల పండుగలను ప్రశాంతంగా జరగనియ్యరా?: బండి సంజయ్

-

భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హిందువుల పండుగలను ప్రశాంతంగా జరగనీయరా? అంటూ మండిపడ్డారు. ” భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను. హిందువుల పండుగలను ప్రశాంతంగా జరగనీయరా? గణేష్ నిమర్జనం ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని అడిగితే అరెస్టు చేస్తారా? నిమర్జనం కోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని అడిగితే అరెస్టు చేయడమేంటి?

ప్రశాంతంగా వినాయక నిమర్జనం జరగాలని మేము అనుకుంటున్నాం.. రాచిరంపాన పెట్టాలని సీఎం చూస్తున్నాడు. ఇతర వర్గాల పండుగలకు రాని ఇబ్బందులు.. హిందువుల పండుగలకే ఎందుకు? హిందూ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్నా. హిందూ సమాజమంతా సంఘటితం కావలసిన సమయం ఆసన్నమైంది”. అంటూ సోషల్ మీడియా ద్వారా మండిపడ్డారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news