ఇన్నాళ్లు నాపై చూపిన అభిమానానికి థాంక్యూ.. స్మితా సభర్వాల్ పోస్టు వైరల్

-

ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్​లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సివిల్స్​కు ఎంపికై 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఓ పోస్టు పెట్టారు. కొత్త సవాల్ కు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు. ఎంత ముందుకు వెళ్లామో కొన్ని చిత్రాలు గుర్తు చేస్తాయని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఓ యువతి తన అభిమతానికి అనుగుణంగా ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ 23 ఏళ్లుగా ప్రయాణం సాగిస్తోందని క్యాప్షన్​లో పేర్కొన్నారు. ఇన్నాళ్లుగా తనపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పోస్ట్ చేశారు.

తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది. మొన్నటి వరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా ఉన్న స్మితా సభర్వాల్ రజత్ కుమార్ పదవీ విరమణ అనంతరం నీటిపారుదల శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇప్పటి వరకు ఆమె కలవలేదు. ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షకు కూడా హాజరు కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version