సోనియాగాంధీ దేశద్రోహి.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు రావాలి: కేఏ పాల్

-

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. సోనియా తెలంగాణ తల్లి కాదని.. దేశ ద్రోహి అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశ ద్రోహి పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావని చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బయటకు రావాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ 48 ఎంపీ స్థానాలకు పరిమితం అయిందని… రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 30 లేదా 20 కి చేరుతుందని జోస్యం చెప్పారు.

పార్టీల కంటే మనకు దేశమే ముఖ్యం అని అన్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని విమర్శించారు. ఇదిలా ఉంటే.. హైదరాబాదులో రెడ్డి గర్జన సభలో మంత్రి మల్లారెడ్డి పై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు కులమతాలను ఉపయోగించుకొని ప్రజలను రెచ్చగొడుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అది రెడ్డి వర్గాల మధ్య జరిగిన గొడవ అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం సరికాదని.. మాటల ద్వారా దాడి చేయడం కూడా తప్పేనని అన్నారు. మన దేశాన్ని నెంబర్ వన్ చేయాలన్నదే తన తపన అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news