కేసీఆర్ ప్రభుత్వంపై సుప్రీం సీరియస్..ఏపీ ఉద్యోగులను పట్టించుకోరా !

-

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశాలు తెలంగాణ అమలు చేయలేదని సుప్రీంకోర్టుకు ఉద్యోగులు తెలిపారు. అయితే.. కోర్టు ఆదేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని తెలంగాణపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆంధ్ర నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు చివరి అవకాశం ఇస్తున్నామన్న ధర్మాసం.. రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 31న మరోసారి సమీక్ష చేయనున్నట్లు ప్రకటించిన ధర్మాసనం.. విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news