నూకలు తినమని అవమానించిన బీజేపీకి… నూకలు చెల్లెలా తీర్పు ఇవ్వాలి : హరీష్ రావు

-

గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో పలు అభివృద్ది కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ.. వడ్లు కొనమంటే….నూకలు తినమని తెలంగాణ ప్రజలను ఎద్దేవా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మనం నూకలు తినమనడం…యావత్తు తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే అని అగ్రహించారు.

ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించింతేనె ధరలు తగ్గుతాయని.. నూకలు తినమని అవమాన పరిచిన బిజేపి ప్రభుత్వానికి నూకలు చెల్లెలా తీర్పు ఇవ్వండని పిలుపు నిచ్చారు. పెట్రోల్ డీజిల్, వంట గ్యాస్ పై పెంచిన ధరలను చేతనైతే తగ్గించి బీజీపీ మాట్లాడాలని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లక్షా 30 వేల పోస్టులను ఇప్పటికే భర్తీ చేసిందని చెప్పారు.

మళ్ళీ 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనుందని స్పష్టం చేశారు. రక్షణ శాఖ తో సహా దేశంలోని కేంద్ర ప్రభుత్వ శాఖల లో 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. దమ్ముంటే వెంటనే 15 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ కు మంత్రి తన్నీరు హరీష్ రావు సవాల్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news