ఇది ప్రజాపాలన కాదు.. రాక్షస పాలన – మహేశ్వర్‌ రెడ్డి

-

తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ పథకం నిధుల టెండర్లలో జరిగిన అవినీతిని నిరూపించడానికి నేను సిద్ధమని…. గ్లోబల్ టెండర్లతో 40 శాతం లెస్ కి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే నేను రాజీనామాకు సిద్ధమని సవాల్‌ విసిరారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఉందని ఫైర్‌ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని… జవాబుదారీ తనం లేదు.. పారదర్శకత లేదని ఆగ్రహించారు.

పేరుకే ప్రజా పాలన అని… ప్రజాదర్బార్ కనరాకుండ పోయిందని నిప్పులు చెరిగారు. ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన సాగుతోందని… రేవంత్ బాబా 11మంది దొంగలుగా పాలన నడుస్తోందని నిప్పులు చెరిగారు. పరిపాలన భ్రస్తుపట్టిందని… రేవంత్ అవినీతి పాలన పై బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రజాక్షేత్రంలో అవినీతిని బయట పెడతామని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version