భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉద్రిక్తత

-

వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కొనసాగుతున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనగామ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ బయటపడింది. పొన్నాల, కొమ్మూరి వర్గీయుల మధ్య విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఈ నేపథ్యంలో బట్టి విక్రమార్క ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అబ్దుల్ నాగారం లోకి భట్టి పాదయాత్ర ప్రవేశించగా.. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పొన్నాల కారుకు మరో కారును అడ్డుగా పెట్టిన కొమ్మూరి వర్గం నేతలు వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో కొమ్మూరి ప్రతాపరెడ్డి పై భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version