నల్గొండలో మరో ఘోరం తాగు నీటిలో మొన్న కోతులు, నిన్న వాటర్ ట్యాంక్లో శవం, నేడు చనిపోయిన కోళ్లు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ తాగు నీటి కోసం ఉపయోగించే అక్కంపల్లి రిజర్వాయర్ లో బర్డ్ ఫ్లూతో మృతి చెందిన వందలాది కోళ్లను పడేశాడు. నల్లగొండ జిల్లా నుంచి కృష్ణా నది వాట్ హైదరాబాద్ జంట నగరాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే పీ.ఏ పల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 80 కోళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. రిజర్వాయర్లో పెద్ద మొత్తంలో చనిపోయిన కోళ్లు వేశారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.
ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వార్తల నేపథ్యంలో రిసర్వాయర్ లో మృతి చెందిన కోళ్ల ఘటన ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో నితో అప్రమత్తమైన అధికారులు శుక్రవారం రిజర్వాయర్ ను పరిశీలించారు. చనిపోయిన కోళ్లు, వాటి వ్యర్ధాలు వేశారనే నేపథ్యంలో రిజర్వాయర్ను ఇరిగేషన్ అధికారులతో కలిసి దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి పరిశీలించారు రిజర్వాయర్ వెనక జలాలలో దాదాపు 80 కోళ్ల లభ్యం అయ్యాయి. వీటిని స్థానిక రెవిన్యూ సిబ్బందితో బయటికి తీసి రిజర్వాయర్ మొత్తం పరిశీలిస్తున్నారు. రిజర్వాయర్లో కోళ్లను ఎవరు వేశారు అనే కోణంలో విచారణ చేపడుతున్నామని ఆర్డీఓ వెల్లడించారు.