దొరకు మద్యం అమ్మకాల మీదున్న శ్రద్ధ పేద పిల్లల చదువులపై లేదు – వైఎస్ షర్మిల

-

దొరకు మద్యం అమ్మకాల మీదున్న శ్రద్ధ పేద పిల్లల చదువులపై లేదన్నారు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాగుబోతుల మీద ఉన్న ప్రేమ.. సర్కారీ బడుల్లో వసతుల కల్పన మీద లేదని ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. తాగు, తాగిపించు ఇదే దొరకు తెలిసిన రాష్ట్ర అభివృద్ధని మండిపడ్డారు. కేసీఆర్ కు బడుల కన్నా బార్లే ఎక్కువ.. విద్యార్థుల కన్నా మందుబాబులే మక్కువన్నారు. విద్యాభివృద్ధిపై దొర చెప్పే మాటలకు, చేతలకు పొంతనే ఉండదన్నారు షర్మిల.

“కేసీఆర్ మనవడు, రంగయ్య మనవడు ఒకే బువ్వ తినాలి, ఒకే చదువు చదవాలి అని మాయ మాటలు చెప్పాడు. సర్కారీ బడుల్లో సౌలత్ లు లేక,రంగయ్య మనవడు తెల్లమొహం ఏస్తే.. కేసీఆర్ మనవడు అంగరంగ వైభవంగా పట్టాలు అందుకుంటున్నడు. రూ.3500 కోట్లతో మన ఊరు-మన బడి అంటూ ఊదరగొట్టారు. కార్పొరేట్ ను తలదన్నే ఎడ్యుకేషన్ అని గొప్పలు చెప్పారు. ఏటికేటా అడ్మిషన్లు హైక్ అంటూ ఫేక్ కథలు అల్లారు. అసలు విషయం ఆరా తెస్తే దొర గారి విద్యా వ్యవస్థ అంతా పైన పటారం,లోన లొటారం 26 వేల పాఠశాలలకు,12వందల స్కూళ్లను బాగుచేయడం దొర చెప్పే విద్యాభివృద్ధి. 3వేల కోట్లు కేటాయించి 30 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవడం దొరకు విద్యా వ్యవస్థపై ఉన్న ప్రేమ.

సగానికి సగం స్కూళ్ళలో 30 మంది విద్యార్థులు లేకపోవడం విద్యాశాఖ గొప్ప పనితనం. ఏటికేటా అడ్మిషన్లు లేక మూతపడుతున్న బడులు కేసీఆర్ అభివృద్ధి పాలనకు చిహ్నాలు. 6 వేల పాఠశాలలకు “ఏకోపాధ్యాయ” ఇదేనా ప్రభుత్వ విద్య.? రాష్ట్రంలో 26 వేల టీచర్స్ పోస్టులు ఖాళీగా పెట్టి.. సర్కార్ విద్యను బొంద పెట్టి..కార్పొరేట్ విద్యకు కొమ్ముగాయడమే దొర ప్లాన్. పాఠశాల విద్యకు చెదలు పట్టించి.. ఉన్నత విద్యను దొర భ్రష్టు పట్టించాడు. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించక వృత్తి విద్యను ఆగం చేసిన మోసగాడు కేసీఆర్” అని తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news