మలిదశ తెలంగాణ ఉద్యమ హీరోలను బయటికి తేవాలి – ఎంపీ లక్ష్మణ్

-

మలిదశ తెలంగాణ ఉద్యమ హీరోలను బయటికి తేవాలని అన్నారు బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ లక్ష్మణ్. శుక్రవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న సబ్బండ వర్గాలకు స్ఫూర్తి అని అన్నారు. జమీందారులు, మొగలాయిలు, దొరలను ఓడించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.

వృత్తిని అవహేళన చేసిన, అగౌరవంగా వ్యవహరించిన వారిపై పాపన్న తిరుగుబాటు చేశారని అన్నారు. సీఎం కేసీఆర్ కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ల త్యాగాలకు గుర్తింపు లేకుండా చేశారని ఆరోపించారు. పాపన్న స్పూర్తితో నిజమైన చరిత్రకారులను వెలుగులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version