తెలంగాణలో మేము పార్టీ పెట్టడానికి కారణం కెసిఅరే: షర్మిల

-

అన్న మీద కోపం ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ స్థాపించుకొవాలంటూ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచించారు.దీనికి షర్మిల ఘాటుగానే సమాధానం ఇచ్చారు.అన్న మీద కోపంతో తెలంగాణలో పార్టీ పెట్టలేదు అంటూ వివరణ ఇచ్చారు.తము పార్టీ పెట్టడానికి కారణం నీ అయ్యా కేసీఆర్ గారేనని కేటీఆర్ కు చెప్పారు.రైతుల ఆత్మహత్యలు చూడలేక, నిరుద్యోగుల బలవన్మరణాలు చూడలేక, రీడిజైన్ ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడం చూడలేకే తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చిందని చెప్పారు.

తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, కెసిఆర్ లు లాఠీ దెబ్బలు తిన్నారా అంటూ షర్మిల ప్రశ్నించారు.బలిదానం చేసుకున్నారా? పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె మర్చిపోయింది మీరు కాదా అంటూ ప్రశ్నించింది.గడ్డాలు పెంచుకొని దీక్షచేసింది మీరు, అమరుల బలిదానాల పై అధికారంలోకి వచ్చింది మీరు, ఉద్యమ ద్రోహుల ను అక్కున చేర్చుకుంది మీరు, అనేక పోరాటాలు చేసి కెసిఆర్ మెడలు వంచిన ఘనత మాది, మీరు మొనగాళ్ళు అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ ఫైర్ అయ్యారు షర్మిల .

Read more RELATED
Recommended to you

Latest news