రాబోయే కాలంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి – రేవంత్ రెడ్డి

-

మంగళవారం ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో భేటీ అనంతరం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జూలై 7 నాటికి పిసిసి అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తవుతుందని తెలియజేశారు. ఈ ఏడాది కాలంలో తాను చేపట్టిన కార్యక్రమాలను కేసీ వేణుగోపాల్ కి వివరించానని వెల్లడించారు.” రాబోయే కాలంలో పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయి. చేరికలపై అనూహ్యంగా ముందుకు వెళ్తున్నాం. ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులను బట్టి పార్టీలో చేర్చుకుంటున్నాం.

పార్టీలో చేరే వారి గురించి ముందే మీడియాకు తెలియటం వల్ల అధికారపార్టీ వారి పైన కేసులు పెట్టి అరెస్టు చేస్తోంది. అందువల్లనే పార్టీలో చేరే వారిని ముందుగా మీడియాకు తెలియనివ్వట్లేదు. హైదరాబాదులో విష్ణు వర్ధన్ రెడ్డి నన్ను కూడా ఆహ్వానించారు. మీడియా కావాలని తప్పుడు ప్రచారం చేస్తోంది. రాబోయే కాలంలో హైదరాబాదులో జిల్లా కార్యకర్తలను కలుపుకొని విష్ణువర్ధన్ రెడ్డి సభ పెడతానన్నారు. దానికి టీ పీసీసీ అధ్యక్షుడిగా దాని అనుమతులు ఇచ్చాను”అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news