కేసీఆర్ తో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడలేదు – KTR

-

నాగర్ కర్నూల్ సభలో సీఎం కేసీఆర్ పై బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ ను జైల్లో పెడతామని నిన్న నాగర్ కర్నూల్ సభలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రజలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తున్నందుకు జైలుకు పంపుతారా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ తో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని అన్నారు కేటీఆర్.

ఇక అంతకుముందు ఉప్పల్ చౌరస్తాలో రూ.36.50 కోట్లతో నిర్మించిన స్కై వాక్ ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్. ఈ స్కైవాక్ తో ప్రయాణికులు రామంతపూర్ నుండి ఉప్పల్ వైపు, ఉప్పల్ వైపు నుండి రామంతపూర్ వైపు , నాగోల్ వైపు నుండి హబ్సిగూడ వైపు, హబ్సిగూడ వైపు నుండి నాగోల్ వైపు పాదాచారులు స్కైవాక్ ద్వారా భద్రంగా రోడ్డు దాటవచ్చు. ఇక స్కైవాక్ లిఫ్ట్ తో పాటు ఎస్కలేటర్ కూడా ఉంది. వృద్ధులు లిఫ్ట్ ద్వారా స్కైవాక్ ఎక్కి రోడ్డు దాటవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news