ప్రజాభవన్ లో పార్టీ చేసుకున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు ?

-

ప్రజాభవన్ లో పార్టీ చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లోని అధికారిక నివాసానికి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ఈ విందు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ప్రజాభవన్ లో ఇచ్చిన విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జయరాం రమేష్ హజరయ్యారు.

Top leaders of Congress party in Praja Bhavan

అలాగే, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డిజిపి రవి గుప్తా, ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్య, శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, పలువురు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ఇచ్చిన విందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version