హైడ్రా ను చూసి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు..?

-

సీఎం రేవంత్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం హైడ్రా. ఆక్రమణకు గురైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా కాపాడుతుంది. కానీ హైడ్రా ను చూసి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్నారు. నాకు 111 లో కానీ..FTL లో భూమి లేదంటున్నాడు. కానీ ఫిరంగి నాలా మూసేసి.. ఇంద్రభవనం లాంటి ఫార్మ్ హౌస్ కట్టాడు KTR.

ఇండ్లు లీజుకు తీసుకుంటాం కానీ.. కేటీఆర్ ఫాం హౌస్ లీజుకు తీసుకున్నాడు. బినామీల పేరుతో ఆక్రమణకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రేవంత్ వెలుగులోకి తెచ్చారు. కానీ ఆయన్ను అరెస్టు చేసి 14 రోజులు జైల్లో పెట్టాడు కేటీఆర్. కానీ కేటీఆర్ సతీమణికి శైలిమా పేరుతో భూములు ఉన్నాయి. కేసీఆర్ నుండి మొదలుకుని కేటీఆర్.. కార్పొరేటర్ ల వరకు ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు. లక్షల ఎకరాల భూములు విధ్వంసం చేశారు. ఫాం హౌస్ కూడా ప్రైవేటు వ్యక్తిని భయపెట్టి లాక్కున్నాడు కేటీఆర్ అంటూ ఆ భూములకు సంబంధించిన డాక్యుమెంట్స్ విడుదల చేసారు మహేష్ గౌడ్

Read more RELATED
Recommended to you

Exit mobile version