సోనియా త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీ కాంగ్రెస్ నేతలు

-

సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా రావడంతో త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, సీతక్క ఇతర ముఖ్యనేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ నేపథ్యంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని కాంగ్రెస్ నేతలు దర్శించుకున్నారు.

కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కరోనా బారిన పడ్డారు. ఆమె కరోనా బారిన పడ్డట్టు కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలిందని సూర్జేవాలా తెలిపారు.కాగా పూజలు నిర్వహించిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని పూజలు చేశామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సోనియాగాంధీ కోలుకోవాలని అన్ని మతాలవారు పూజలు, ప్రార్థనలు చేయాలన్నారు. అలాగే వి. హనుమంతరావు మాట్లాడుతూ.. అమెరికాలో ఉన్నప్పుడు కూడా సోనియాగాంధీ కోలుకోవాలని పూజలు చేశామని, నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా నాకు కాల్ చేసి మాట్లాడారు విహెచ్ గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news