23 రాజకీయ పార్టీలను ఏకం చేసి.. పాలన చేసిన వ్యక్తి వాజ్ పెయి – కేంద్ర మంత్రి

-

బిజెపి రాష్ట్ర కార్యాలయం లో అటల్ బీహారీ వాజ్ పెయ్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చిత్రపటానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రియమైన నేత అజాత శత్రువు అటల్ బిహారీ అన్నారు. దేశ వ్యాప్తంగా అయన వర్ధంతి సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

జాతీయ రహదారులు నిర్మాణ కర్త వాజ్ పేయ్‌ అని.. వాల్మీకి అంబేడ్కర్ యోజన కింద పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చారన్నారు. ఒక ఓటు తక్కువ పడితే నైతికంగా వ్యవహరించింది పదవి నుండి తప్పుకున్న వ్యక్తి అని.. 23 రాజకీయ పార్టీలను ఏకం చేసి పాలన చేసిన వ్యక్తి అటల్ బీహారీ వాజ్ పెయి అని వెల్లడించారు. కొందరు వ్యతిరేకించిన పొక్రాన్ లో అణు పరీక్షలు జరిపి ప్రపంచానికి దేశ సత్తా ను నిరూపించిన వ్యక్తి అని.. పాక్ కి స్నేహ హస్తం అందిస్తే ఆయనను మోసం చేసిన దేశం పాక్ అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news