భారతదేశం నుండి బిజెపి పార్టీని తరిమికొడతాం – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

-

రంగారెడ్డి జిల్లా నార్సింగీ మునిసిపల్ లో టీఆర్ఎస్ పార్టీ విసృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి మోడితో పాటు తెలంగాణా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల పిచ్చితో భారత దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

హిందు, ముస్లిం మద్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని.. మీ పార్టీని బొంద పెట్టి…..త్వరలోనే భారత దేశం నుండి బీజేపీ పార్టీని తరిమికొడుతామన్నారు. మీ పార్టీ తెలంగాణకు ఏమి చేసిందో చెప్పాలని బండి సంజయ్ ను ప్రశ్నించారు?…… ముఖ్యమంత్రి తెలంగాణ కు ఏమి చేసాడో మేము చెబుతాం అంటూ సవాల్ విసిరారు. ఒళ్లు దెగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

హైదరాబాదులో హిందు, ముస్లిం మద్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన ఓ ఎమ్మెల్యేను జైలుకు పంపామని.. కేవలం 8 గంటలోనే హైదరాబాద్ లో జరిగిన అల్లర్లను కంట్రోల్ చేసి హైదరాబాద్ ప్రజలకు భరోసా కల్పించామన్నారు. బీజేపీ, మోడిని గద్దె దించేంత వరకు టీఆర్ఎస్ పార్టీ నిద్ర పోదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 100 సీట్లు గెలుచుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news