మీరు ఆశీర్వదించండి… వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తా – వైఎస్ షర్మిల

-

మీరు ఆశీర్వదించండి…తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కోదాడ అనంతగిరి మండలం శాంతి నగర్ కు చేరుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ సంక్షేమ పాలన లేదు కాబట్టే పార్టీ పెట్టాం… వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమన్నారు.

వైఎస్సార్ హయాంలో తెలంగాణ సుభిక్షం గా ఉంది… కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలను వైఎస్సార్ ఆదుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఏ పథకం చేసినా అద్భుతంగా చేసి చూపించారు.. 8 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి వర్గాన్ని మోసం చేశారని వెల్లడించారు. డబుల్ బెడ్ రూం అని మోసం…మూడు ఎకరాల భూమి అని మోసం… ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారని.. ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు అని చెప్పారు. ఇంట్లో ఎంత మంది వృద్దులు…వికలాంగులు ఉన్నా అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news