శబరిమల యాత్రపై దేవస్థానం బోర్డు కీలక ప్రకటన..

-

శబరిమల యాత్ర పై కీలక ప్రకటన చేసింది శబరిమల దేవస్థానం బోర్డు. శబరిమల యాత్ర పై అపోహలు వీడి పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు తరలిరావాలని శబరిమల దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎం వాసు నాయర్ తెలిపారు. దేశంలో అధిక శాతం ప్రజలు కరోనా వ్యాక్సిన్.. తీసుకున్న నేపథ్యంలో… తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమల అయ్యప్పస్వామి దర్శించుకోవాలని అని ప్రకటన చేశారు.

దేశం నలుమూలల నుంచి శబరి కి ఏటా రెండు కోట్ల మంది అయ్యప్ప స్వాములు వస్తూ ఉంటారని ఆయన తెలిపారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా బోర్డు నిబంధనల మేరకు కొన్ని ఆంక్షలు విధించాలన్నారు. ఈ ఆంక్షల కారణంగా అయ్యప్ప భక్తుల సంఖ్య సగానికి పడిపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్ప గురు స్వాములు ఇచ్చిన సలహాలు మరియు సూచనలను పరిగణలోకి తీసుకుని త్వరలో బోర్డు సమావేశంలో చర్చించి స్వాములకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version