షాకింగ్‌ : అమలాపాల్‌ను అడ్డుకున్న ఆలయ అధికారులు

-

హీరోయిన్ అమలా పాల్‌కు ఎర్నాకులంలో చేదు అనుభవం ఎదురైంది. అక్కడ స్థానికంగా ఉండే గుడిలో అమ్మవారికి దర్శనానికి వచ్చిన ఈమెకు ఆలయ అధికారులు గుడిలోకి రాకుండా అడ్డకున్నారు. ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలో హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అన్యమతస్తులకు ప్రవేశం లేదు. ఈ నేపథ్యంలో ఆలయ సందర్శనకు వచ్చిన ప్రముఖ నటి అమలాపాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. దర్శనం కోసం ఆలయంలోకి వెళ్లకుండా అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో రాసుకొచ్చారు.

తాను అమ్మవారిని చూడలేకపోయినా ఆత్మను అనుభవించానని అమలాపాల్ ఆ రిజిస్టర్‌లో రాశారు. 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయంలోకి తనను అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు పేర్కొన్నారు. తాను ఆలయంలోకి వెళ్లలేకపోయినా దూరం నుంచే అమ్మవారిని ప్రార్థించానని, మతపరమైన వివక్షలో త్వరలోనే మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. మతం ప్రాతిపదికన కాకుండా అందరినీ సమానంగా చూసే సమయం వస్తుందని ఆశిస్తున్నట్టు రిజిస్టర్‌లో అమలాపాల్ రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news