పది మంది తెరాస ఎమ్మెల్సీలకు నేరచరిత్ర

-

తెలంగాణ శాసనమండలి సభ్యుల్లో 10 మందిపై క్రిమినల్‌ కేసులున్నాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. అందులో ఆరుగురిపై తీవ్రమైన అభియోగాలున్నాయని, ఆ ఆరుగురు తెరాసకు చెందిన వారేనని తెలిపింది. సభ్యుల్లో ఇద్దరు డాక్టరేట్లు ఉన్నారని వెల్లడించింది.


మండలిలోని 40 మంది ఎమ్మెల్సీల్లో 33 మంది నామినేషన్ల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వారిపై ఉన్న కేసులు, ఆస్తులు, విద్యార్హత తదితర వివరాలతో కూడిన నివేదికను ఏడీఆర్‌ తాజాగా విడుదల చేసింది. కురుమయ్యగారి నవీన్‌ (తెరాస) అఫిడవిడ్‌ అందుబాటులో లేకపోవడం, ఆరుగురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలు అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేకపోవడంతో వారి వివరాలను నివేదికలో పొందుపర్చలేదు.

అయిదేళ్లకు పైబడిన జైలు శిక్ష పడే కేసులు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేవి, ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనకు సంబంధించిన కేసులను తీవ్రమైనవిగా పరిగణిస్తారు. పాడి కౌశిక్‌రెడ్డి, మహమూద్‌అలీ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండా ప్రకాశ్‌, కడియం శ్రీహరి, మంకెన కోటిరెడ్డిపై ఇటువంటి కేసులున్నాయి. సత్యవతి రాథోడ్‌, కల్వకుంట్ల కవిత, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిపై సాధారణ కేసులున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news