ఈటల రాజేందర్ కు మంత్రి కేటీఆర్ ఫోన్

-

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట నిన్న తీవ్ర విషాదం.. చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి నిన్న తీవ్ర అస్వస్థతకు గురై…మరణించారు. 104 ఏళ్లు ఉన్న ఈటల రాజేందర్‌ తండ్రి ఈటల మల్లయ్య.. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. గత వారం హన్మకొండలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రిని తీసుకువెళ్లారు.

అప్పటి నుంచి ఈటల మల్లయ్య.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య (104) పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఇక ఈటల తండ్రి మృతి పట్లు పలుగురు సంతాపం తెలపగా.. ఏకంగా మంత్రి కేటీఆర్‌.. ఈటల రాజేందర్‌ కు ఫోన్‌ చేశారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ఫోన్‌ చేసి పరామర్శించారు మంత్రి కే. తారక రామారావు. ఫోన్లో రాజేందర్ గారితో మాట్లాడి ఆయన తండ్రి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు.

Read more RELATED
Recommended to you

Latest news