నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటనలో ఉద్రిక్తత

-

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ఆయన విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గం ద్వారా పలాస వెళుతున్న లోకేష్ ను శ్రీకాకుళం సమీపంలోని జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహంతొ పార్టీ శ్రేణులు, నారా లోకేష్ రోడ్డుపైనే బైఠాయించారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు.

నారా లోకేష్ వాహనం వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీగా మోహరించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవ సభ పేరుతో ఓ కార్యక్రమానికి పూనుకోగా రెండు రోజుల క్రితమే పార్టీ నేతలకు చెందిన ఇళ్లను కూల్చివేసేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. ఈ తరుణంలోనే తమ పార్టీ నేతను పరామర్శించేందుకు నారా లోకేష్ పలాస వెళ్లడానికి విశాఖ ఎయిర్ పోర్టు నుండి వెళుతున్న క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు ఆయననుు అడ్డుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news